న్యూఢిల్లీ : మన దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. శనివారం 41,831 మంది పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసులు 4 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతున్నది. ఇది థర్డ్ వేవ్కు దారితీస్తుందని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితిలో కరెన్సీ నోట్ల ద్వారా (Caorna and Cash) కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నదని జర్మనీకి చెందిన ఒక పరిశోధన వాదన ఓదార్పునిస్తున్నది.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిపుణులు రుహ్ర్-యూనివర్శిట్ బోకం మెడికల్ మాలిక్యులర్ వైరాలజీ విభాగంతో కలిసి పరిశోధన నిర్వహించారు.వీరి అధ్యయనం ‘ఐసైన్స్ జర్నల్’లో ప్రచురించబడింది. నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు.
వైరస్ వివిధ కాలాల పాటు స్టెయిన్ లెస్ స్టీల్ ఉపరితలాలపై అంటే నాణేలు, నోట్లపై జీవించింది. ఏడు రోజుల తర్వాత కూడా స్టీల్ ఉపరితలంపై వైరస్ సజీవంగా ఉండటాన్ని గుర్తించారు. 10 యూరో నోట్లో మూడు రోజుల తర్వాత వైరస్ పూర్తిగా అదృశ్యమైంది. 10 సెంట్ల కాయిన్పై 6 రోజులు, యూరో కాయిన్పై రెండు రోజులు, 5 సెంట్ల కాయిన్పై గంట తర్వాత ఎలాంటి వైరస్ లేదు. 5 సెంట్ల నాణెం రాగితో తయారు చేయబడిందని, దానిపై వైరస్ ఎక్కువ కాలం ఉండదని పరిశోధకుడు డేనియల్ చెప్పారు.
ఈ వైరస్ ఉపరితలం నుంచి మన వేళ్లకు ఎలా బదిలీ అవుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులు కొత్త టెక్నిక్ను అభివృద్ధి చేశారు. దీని కోసం, నియంత్రిత వాతావరణంలో సోకిన నోట్లు, నాణేలు, క్రెడిట్ కార్డులు వంటి పీవీసీ ప్లేట్ల ద్వారా కరోనా వైరస్ చేతులకు ఎలా చేరుతుందో గుర్తించారు.
పొడిగా ఉన్న ఉపరితలం నుంచి ప్రసారం జరుగలేదని డానియల్ తెలిపారు. నిజ జీవిత పరిస్థితుల్లో నాణేలు లేదా నోట్లు తడిసిపోకుండా ఉంటే అదే జరుగుతుంది. దీని ఆధారంగా కరెన్సీ నోట్ల ద్వారా సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువ అని ఈ పరిశోధనలు తేల్చారు.
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..