విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన యువ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ తన ప్రత్యేకమైన కళారూపానికి గాను పద్మశ్రీ అవార్డుకు (mirco-artist nominated for Padmasri Awards) నామినేట్ అయ్యాడు. ఇప్పటికే తన మైక్రో ఆర్ట్ వర్క్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కిన వెంకటేష్.. అగ్గిపుల్లలు, పెన్సిల్లు, చాక్పీస్లు, టూత్పిక్స్, బ్యాంగిల్స్పై 500కు పైగా సూక్ష్మ శిల్పాలను చెక్కి ఇప్పటివరకు 100 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
పన్నెండేండ్ల వయస్సులో ఉన్నప్పుడు గణేశుని శిల్పాన్ని చెక్కి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటినుంచి ఈ మైక్రో ఆర్ట్ అంటే మక్కువ పెంచుకుని ఇదే సర్వస్వంగా జీవిస్తున్నాడు.
ఈఫిల్ టవర్, జాతీయ చిహ్నం, వరల్డ్ కప్ ట్రోఫీ వంటి అనేక వస్తువులను సూక్ష్మంగా చెక్కారు. ఒక కుగ్రామంలో జన్మించిన వెంకటేశ్ తండ్రి రైతు, తల్లి గృహిణి. అతడి లక్ష్యాన్ని సాధించడానికి, అభిరుచిని నెరవేర్చడానికి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి పట్టభద్రుడైన వెంకటేష్.. జర్మనీలోని పీస్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో డాక్టరేట్ అందుకున్నాడు.
కళలు, చేతిపనుల పట్ల తన అభిరుచిని పంచుకునే ఇతరులకు సహాయం చేయడానికి ‘వెంకీ ఆర్ట్స్’ ను స్థాపించి కళాకారులుగా కెరీర్ను కొనసాగించాలనుకునే విద్యార్థులకు సహాయపడ్డాడు. ఇప్పటివరకు దాదాపు రెండు వేలకుపైగా విద్యార్థులను తీర్చిదిద్దాడు. టూత్పిక్పై 23 నిమిషాల్లో ఎంపైర్ స్టేట్ బిల్డిండ్ను చిత్రించి 2017 లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2018 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకున్నాడు.
వాట్సాప్పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..