జెరూసలెం : వైద్యరంగంలో సంచలనం ఇజ్రాయెల్లో నమోదైంది. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి (Fetus in newborn’s womb) వైద్యులను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం వైద్యులు గుర్తించారు. మనిషి రూపాన్ని సంతరించుకున్న ఈ పిండాల్లో గుండె, ఎముకలు కూడా అభివృద్ధి చెందాయంట. సర్జరీ చేసి పిండాలను వైద్యులు తొలగించి చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా 10 లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఈ సంచలనం ఇజ్రాయెల్లోని ఆష్డోడ్ అనే పట్టణంలో నమోదైంది.
ఆష్డోడ్ పట్టణంలోని ఆస్సుటా మెడికల్ సెంటర్లో ఒక మహిళ ఆడ శిశువుకు ఈ నెల తొలి వారంలో జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయానికి ముందు గర్భిణికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపిన వైద్యులు.. గర్భంలోని ఆడశిశువు పొట్టభాగం సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రసవం అనంతరం చిన్నారికి ఆల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు జరిపిన వైద్యలు.. నవజాత శిశువు కడుపులో ఒకటికన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో వెంటనే నియోనాటాలజీ విభాగం డైరెక్టర్ ఓమర్ గ్లోబస్ నేతృత్వంలో చిన్నారికి సర్జరీ చేసి పలు పిండాలను బయటకు తీశారు.
శిశువు కడుపులో ఉన్న పిండాలు ఇప్పుడిప్పుడే రూపాలను సంతరించుకుంటున్నాయని, ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్ ఓమర్ గ్లోబస్ చెప్పారు. తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరో పిండం పోవడం వల్ల ఇలాంటివి వెలుగులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఆఫ్ఘాన్లో 6 నెలల్లో 1659 మంది మృతి : యూఎన్ నివేదిక
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..