ముంబై : మృత్యు కోరల్లో నుంచి బయటపడ్డారని చెప్పగా మనలో చాలా మంది విని ఉంటాం. మనదాకా వస్తేగానీ దాని అనుభవం తెలిసిరాదు. అచ్చం ఇలాంటి అనుభవాన్నే సొంతం చేసుకున్నాడు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన ఓ ఆటోవాలా. (Death 3 inches away)
పాల్ఘర్లోని విసావా రిసార్ట్స్లో ఓ వినియోగదారుడిని తీసుకెళ్లేందుకు ఆటో వచ్చింది. వినియోగదారుడు వస్తున్నంత సేపట్లో పక్కనే ఉన్న ఓ పెద్ద కొబ్బరి చెట్టు విరిగి అమాంతం ఆటోపై పడింది. దాంతో రెండు ముక్కలైంది. దానిలో ఉన్న ఆటోడ్రైవర్ చెట్టు పడిపోతుండటాన్ని గమనించి ఒక్క ఉదుటన కిందికి దిగాడు. దాంతో మృత్యువు 3 ఇంచుల దూరం నుంచి వెళ్లిపోయింది. చిన్న దెబ్బ కూడా తగలకుండా డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు. గత నెల 26 న సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ సంఘటనను రిసార్ట్స్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. తన జీవనాధారమైన ఆటో రెండు ముక్కలుగా కావడంతో ఆటోడ్రైవర్ లబోదిబోమన్నాడు. డ్రైవర్ పరిస్థితిని గమనించిన రిసార్ట్స్ యజమాని అతడికి రూ.6000 ఆర్థిక సాయం అందించి ఆదుకున్నాడు.
గత వారం రోజులుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భూమి బాగా మెత్తబడిపోయి చెట్లు కూలిపోయే స్థితికి చేరుకున్నది. గత నెల 29 వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 659.4 మి.మీ వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొన్నది. వర్షాలు కురుస్తున్నందున పాత భవనాలు, చెట్ల సమీపంలో నిలబడకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
టోక్యో ఒలింపిక్స్లో రాణులదే హవా..!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..