KCR | భద్రాద్రి కొత్తగూడెం : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెంలో కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర.. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది. ఇల్లందులో అడుగుపెట్టిన కేసీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మహిళలు మంగళ హారతులిస్తూ కేసీఆర్ బస్సు యాత్రకు స్వాగతం పలికారు.
ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి మంగళ హారతులిస్తూ కేసీఆర్ బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన జనం pic.twitter.com/nPgNQeryUM
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024