అమృత్సర్ : పంజాబ్ ఫ్రాంటియర్ కమాండ్గా తొలిసారి మహిళా ఐపీఎస్ సొనాలి మిశ్రా (Sonali Mishra) నియమితులయ్యారు. అత్తారి సరిహద్దు భద్రత ఒక మహిళా అధికారి చేతిలో ఉండటం ఇదే తొలిసారి. పంజాబ్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ను నిరోధించడం సొనాలి మిశ్రాకు పెద్ద సవాలుగా రానున్నది. భోపాల్లో జన్మించిన సొనాలి మిశ్రా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రైసన్లో ఎస్పీగా, జబల్పూర్లో డీఐజీగా, పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఇంటెలిజెన్స్ ఐజీగా విధులు నిర్వర్తించారు. అప్పటి నుంచి బీఎస్ఎఫ్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు.
కశ్మీర్ లోయలో ఐజీగా పనిచేసిన సొనాలి మిశ్రా.. ఇప్పటి వరకు ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు కమాండింగ్గా ఉన్నారు. కశ్మీర్ లోయలో ఐజీ పనిచేసిన అనుభవంతోనే పంజాబ్లో సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను సమర్ధంగా నిరోధించగలదని భావిస్తున్నారు.
పాకిస్తాన్తో 553 కిలోమీటర్ల పొడవైన అత్తారి సరిహద్దు భద్రత సొనాలి మిశ్రా పర్యవేక్షణలో ఉంటుంది. మాజీ ఐజీ మహిపాల్ సింగ్ యాదవ్ నిష్క్రమణ అనంతరం సొనాలి మిశ్రాకు ఈ పోస్టింగ్ ఇచ్చారు. పంజాబ్ సరిహద్దు డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం సులభమైన మార్గం. అలాగే సరిహద్దులోని ఆకాశంలో తిరుగుతున్న డ్రోన్లు కూడా కష్టాన్ని మరింత పెంచుతున్నాయి. డ్రోన్ ఆయుధాల అక్రమ రవాణా తర్వాత బీఎస్ఎఫ్ సవాళ్లు మరింతగా పెరిగాయి.
కేపీఎల్ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్
మృత్యువు నుంచి బయటపడటం అంటే ఇదే..!
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
టోక్యో ఒలింపిక్స్లో రాణులదే హవా..!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..