న్యూఢిల్లీ: ఓవైపు కరోనా కేసులు పెరిగిపోతుండటం, మరోవైపు వ్యాక్సిన్ల కొరతతో సతమతమవుతున్న దేశానికి ఊరట కలిగించే విషయం ఇది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇండియాలో ఆమోదం పొందిన మూడో కరోనా వ్యాక్సిన్గా స్పుత్నిక్ వి నిలిచింది. ఇప్పటికే భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్, సీరమ్ తయారుచేస్తున్న కొవిషీల్డ్ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
గత వారం వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకుంది. దీంతో సోమవారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల కమిటీ దీనిపై చర్చించడానికి సమావేశమైంది. ఆ వెంటనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ను ఇండియాలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తయారు చేస్తోంది. రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయోలజీ దీనిని అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామర్థ్యం 91.6 శాతంగా ఉన్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది.
ఇవి కూడా చదవండి
2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ, శ్వేత జాతేతర వ్యక్తి
దీదీ ఓ దీదీ.. నందిగ్రామ్లో క్లీన్బౌల్డ్ అయ్యావ్: మోదీ
అదానీతో చేతులు కలిపిన వాల్మార్ట్.. ఇండియాలో అతిపెద్ద వేర్హౌజ్ నిర్మాణం!
సన్రైజర్స్ను చీర్ చేసిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్రైడర్స్ 100వ విజయం.. షారుక్ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్కు బాఫ్టా నివాళులు