తిరువనంతపురం: లవ్ జిహాద్ నిజం. ముస్లింలు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారు. వాళ్లు క్రిస్టియన్ దేశాల్లోకి చొరబడి వాటిని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు అని కేరళకు చెందిన ఎమ్మెల్యే పీసీ జార్జ్ అన్నారు. ఆదివాసీ సంక్షేమం కోసం ఏర్పాటైన ఎన్జీవో హెచ్ఆర్డీఎస్ ఇండియా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియాకు కచ్చితంగా హిందూ దేశంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. 2030 కల్లా ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చాలని ముస్లింలు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. నిజానికి నోట్ల రద్దు కారణంగా ముస్లింల పని ఆలస్యమైందని అన్నారు. ఫ్రాన్స్లాంటి క్రిస్టియన్ దేశాల్లోకి ముస్లింలు చొరబడి వాటిని ఇస్లామిక్ దేశాలుగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు.
కేరళలో ఈ దిశగా ముస్లింలు చాలా క్రియాశీలంగా పని చేస్తున్నారని పీసీ జార్జ్ చెప్పారు. ఈ దేశం ఓ వర్గం చేతుల్లోకి వెళ్లాలని అనుకుంటున్నామా? దీనిపై చర్చ జరగాలి. ఎవరో ఒకరు దీనిపై మాట్లాడాలి అని జార్జ్ అన్నారు. ఇది ఎక్కడి వరకూ వెళ్తుంది? లవ్ జిహాద్ లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ నాకు తెలుసు లవ్ జిహాద్ నిజం. కచ్చితంగా ఉంది. దీనికి ఫుల్స్టాప్ పెట్టే పరిష్కారం ఒక్కటే. భారత్ను కచ్చితంగా హిందూ దేశంగా గుర్తించాలి అని పీసీ జార్జ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్రైడర్స్ 100వ విజయం.. షారుక్ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్