న్యూఢిల్లీ: దేశంలో కరోనా అడ్డూఅదుపూ లేకుండా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వాళ్ల మొత్తం సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.
వరుసగా 33వ రోజు కూడా దేశంలో క్రియాశీల కరోనా కేసులు పెరిగాయి. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సంఖ్య 75,086గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కరోనా కేసులు 12,01,009 ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 10 కోట్ల 45 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు.
ఇవి కూడా చదవండి
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్