న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత వేగంగా సంపదను పోగేసుకుంటున్న కుబేరుడు గౌతమ్ అదానీతో చేతులు కలిపింది అమెరికా సంస్థ వాల్మార్ట్. ఇద్దరూ కలిసి ఇండియాలోనే అతిపెద్ద రిటెయిల్ వేర్హౌజ్లలో ఒకదానిని నిర్మించనున్నారు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియాలో అమెజాన్కు చెక్ పెట్టాలని చూస్తున్న వాల్మార్ట్.. అదానీతో చేతులు కలపడం విశేషం.
దీంతో ఇండియాలో ఆన్లైన్ షాపింగ్లో త్రిముఖ పోరు నెలకొననుంది. ఇప్పటికే అమెజాన్, ముకేశ్ అంబానీ సంస్థ రిలయెన్స్ మధ్య పోటీ ఉన్న విషయం తెలిసిందే. 2026 కల్లా ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ విలువ 20 వేల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో బడా సంస్థలు మార్కెట్పై కన్నేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ స్థాయిని అమాంతం పెంచేసింది.
11 ఫుట్బాల్ మైదానాలంత..
అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్లో భాగమైన అదానీ లాజిస్టిక్స్ ఏకంగా 5,34,000 చదరపు అడుగుల ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ముంబైలో ఏర్పాటు కాబోయే ఈ లాజిస్టిక్స్ హబ్ను ఆ తర్వాత వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ సర్వీసెస్కు లీజుకు ఇవ్వబోతున్నట్లు సోమవారం అదానీ లాజిస్టిక్స్ వెల్లడించింది. 2022 మూడో త్రైమాసికానికి ఇది అందుబాటులోకి రానుంది.
ఈ సెంటర్ ఏకంగా 11 ఫుట్బాల్ మైదానాలంత పెద్దదిగా ఉంటుందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 10 లక్షల యూనిట్ల సరుకులను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో అమెజాన్కు ఉన్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కంటే కూడా ఇది పెద్దగా ఉండబోతోంది.
ఇవి కూడా చదవండి
సన్రైజర్స్ను చీర్ చేసిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్రైడర్స్ 100వ విజయం.. షారుక్ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!