హూస్టన్: అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 2024 కల్లా చంద్రుడిపైకి మహిళను, శ్వేత జాతేతర వ్యక్తిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ స్పేస్ఫ్లైట్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు నాసా తెలిపింది. 2024కల్లా చంద్రుడి దక్షిణ ధృవంపై ఆస్ట్రోనాట్లను దింపాలని ఈ మిషన్ భావిస్తోంది.
అందరికీ సమ న్యాయమన్న బైడెన్ ప్రభుత్వ నినాదంలో భాగంగానే నాసా ఈ మిషన్ చేపడుతోంది. గ్రీకు దేవత అయిన ఆర్టెమిస్ పేరు మీదుగా ఈ మిషన్కు ఈ పేరు పెట్టారు. చంద్రుడిపైకి మనిషిని తీసుకువెళ్లిన అమెరికా తొలి మిషన్ అయిన అపోలోకు కవల సోదరే ఈ ఆర్టెమిస్. గతేడాది నవంబర్లో ఈ మిషన్లో పాలుపంచుకోబోయే 18 మంది ఆస్ట్రోనాట్లను నాసా పరిచయం చేసింది. ఇందులో 9 మంది మహిళలతోపాటు కొందరు శ్వేతజాతేతర వ్యక్తులు కూడా ఉన్నారు.
అయితే వీళ్లలో నుంచి చంద్రుడిపై అడుగుపెట్టబోయే తొలి మహిళ, తొలి శ్వేత జాతేతర వ్యక్తి ఎవరో మాత్రం ఇంకా తెలియదు. ఈ బృందంలో ఇండియన్-అమెరికన్ రాజా చారి కూడా ఉన్నారు. ఈ మధ్యే కాంగ్రెస్కు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ నాసా ఈ మిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి
దీదీ ఓ దీదీ.. నందిగ్రామ్లో క్లీన్బౌల్డ్ అయ్యావ్: మోదీ
అదానీతో చేతులు కలిపిన వాల్మార్ట్.. ఇండియాలో అతిపెద్ద వేర్హౌజ్ నిర్మాణం!
సన్రైజర్స్ను చీర్ చేసిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్రైడర్స్ 100వ విజయం.. షారుక్ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!