నల్లబెల్లి, ఆగస్టు 5 : తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, భరత్కుమార్రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్రావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, గందె శ్రీనివాస్గుప్తా తదితరులు సభా స్థలిని పరిశీలించారు.