Mallikarjun Kharge | 2024 సార్వత్రిక ఎన్నికల( 2024 National Elections)పై ఏఐసీసీ చీఫ్ (AICC chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ( 2024 National Elections) కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కూటమిదే విజయమని అన్నారు. మోదీ (Modi), అమిత్ షా (Amit Shah) లాంటి వారు వంద మంది వచ్చిన తమ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. బీజేపీ (BJP) ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్న ఆయన.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
‘2024 సార్వత్రిక ఎన్నికల్లో ( 2024 National Elections) కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయట్లేదు. ఇందుకోసం మా పార్టీ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేకుండా పోతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యం. విపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుంది. మోదీ, అమిత్షా వంటి వారు వంద మంది వచ్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరు’ అని మల్లికార్జున ఖర్గే అన్నారు.
‘‘దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేనే.. ఇతర వ్యక్తులెవరూ నన్ను తాకలేరు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరూ అలా మాట్లాడరు. మోదీజీ.. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారని గుర్తించుకోండి. మీరు నియంత కాదు. ప్రజలచేత ఎన్నుకోబడిన వారు. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని నాగాలాండ్ (Nagaland)లో జరిగిన ఎన్నికల ర్యాలీ (Election Rally)లో మాట్లాడుతూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Shelly Oberoi: ఢిల్లీ మేయర్గా షెల్లీ ఒబెరాయ్.. 34 ఓట్ల తేడాతో నెగ్గిన ఆప్ అభ్యర్ధి
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల
నేపాల్లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు..
Thota Chandrasekhar | బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్నే.. ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
Sadhvi Prachi: ఫహద్ను పెళ్లాడిన స్వరభాస్కర్.. సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు
Nitish Kumar | ఇదేమైనా ఇంగ్లాండా..? ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు..?