న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్(Delhi Mayor) పీఠం ఆప్కే దక్కింది. బీజేపీపై చేపట్టిన ఆమ్ ఆద్మీ(AAP) పోరాటం ఫలించింది. ఇవాళ జరిగిన పోలింగ్లో ఢిల్లీ మేయర్గా ఆప్ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్(Shelly Oberoi) గెలుపొందారు. ఢిల్లీ మున్సిపల్ హౌజ్లో జరిగిన సమావేశంలో .. బీజేపీకి 116 ఓట్లు పోలవ్వగా.. ఆప్కు 150 ఓట్లు పడ్డాయి. మేయర్గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్కు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కంగ్రాట్స్ తెలిపారు. ట్విట్టర్లో ఆయన విషెస్ పోస్టు చేశారు.
#WATCH | AAP's Shelly Oberoi becomes #Delhi mayor with 150 votes pic.twitter.com/LLbAJ1Xh3D
— ANI (@ANI) February 22, 2023
ఎన్నిక రసవత్తరం..
మేయర్ ఎన్నిక విషయంలో ఇప్పటికే మూడుసార్లు మున్సిపల్ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆప్, బీజేపీ మధ్య వాగ్వాదం వల్ల .. మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే ఇవాళ నాలుగోసారి సమావేశమైన ఎంసీడీ.. చివరకు పోలింగ్ నిర్వహించింది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, హన్సరాజ్లు తొలుత ఓటేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల(supreme court order) మేరకు మేయర్ ఎన్నికను నిర్వహించారు.
#WATCH | Aam Aadmi Party's Shelly Oberoi elected as the new mayor of Delhi. pic.twitter.com/wAd8WNUFwx
— ANI (@ANI) February 22, 2023
ఎంపీల తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ఓటు వేశారు. ముందుగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఓటేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున షెల్లీ ఒబ్రాయ్, ఆశూ థాకూర్లు ఆప్ మేయర్ అభ్యర్ధులుగా పోటీపడ్డారు. ఇక బీజేపీ తరపున రేఖా గుప్తా పోటీలో నిలిచారు.
నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదు అని షెల్లీ ఒబ్రాయ్ సుప్రీంలో కేసు వేసిన విషయం తెలిసిందే. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాల్టీలో .. ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలిచింది. బీజేపీ 113 సీట్లు కైవసం చేసుకున్నది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ పట్టుకోల్పోయింది.