Tejaswi Yadav : లోక్సభ ఎన్నికల అనంతరం విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుతీరితే దేశాన్ని పాకిస్తాన్గా విభజించేందుకు పూనుకుంటుందని హిందుస్తాని ఆవామ్ మోర్చా వ్యవస్ధాపకులు, బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు.
విపక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నానని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అయితే ఆయన ఇంత త్వరగా ఆరెస్సెస్ రంగు పులుముకోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంత వరకూ రిజర్వేషన్లను తొలగించే ప్రసకత్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ఇప్పటికే భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.
Read More :