Congress | ముంబై: కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు టికెట్ల కేటాయింపులో మొండి చెయ్యి చూపడంపై అసంతృప్తి మొదలైంది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్తో కూడిన మహా వికాస్ అఘాడీ ఒక్క సీటును కూడా ముస్లింలకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మహమ్మద్ ఆరిఫ్ ఖాన్(నసీం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఘాటు లేఖ రాశారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్ తమకు ఒక్క సీటైనా ఇస్తుందని ముస్లిం లు నమ్మారు. ఒక్క సీటు కూడా ఇవ్వక పోవడంతో నమ్మకం పోయింది. ముస్లింల ఓట్లు కావాలి కానీ ముస్లింలకు టికెట్లు ఇవ్వదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి జవాబు చెప్పలేను. పార్టీకి ప్రచారం చేయలేను. స్టార్ క్యాంపెయినర్ పదవి నుంచి తప్పు కుంటున్నాను.’ అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేస్తుండగా ఒక్కటీ ముస్లింలకు కేటాయించలేదు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్న శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్చంద్ర పవార్) ముస్లింలకు సీట్లు ఇవ్వకపోవడంతో ముస్లిం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.