Nitish Kumar | ఓ వ్యవసాయ పారిశ్రామిక వేత్త అతిగా ఇంగ్లీష్ మాట్లాడటంపై బీహార్ (Bihar) ముఖ్యమంత్రి (Chief Minister ) నితీశ్ కుమార్ (Nitish Kumar )ఆగ్రహించారు. వ్యవసాయానికి సంబంధించి పట్నాలోని బాపు సబాగార్ ఆడిటోరియంలో (Bapu Sabhagar auditorium)మంగళవారం ‘నాలుగో వ్యవసాయ రోడ్ మ్యాప్’ (fourth agriculture roadmap)ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పారిశ్రామికవేత్త అయిన అమిత్ కుమార్.. ముఖ్యమంత్రి నితీశ్ను ప్రశంసిస్తూ ఇంగ్లీష్లో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.
కాసేపటి తర్వాత అమిత్ ప్రసంగాన్ని ఆపిన సీఎం.. ‘మీరు ప్రసంగంలో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తుండటం వల్ల మధ్యలో నేను కల్పించుకోవాల్సి వస్తోంది. ఇదేమన్నా ఇంగ్లాండా..? (Is This England?) అంతలా ఇంగ్లీష్ పదాలు వాడటానికి. మీరు బీహార్లో ఎందుకు పనిచేస్తున్నారు..? సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అనడానికి బదులు సర్కారీ యోజన అనలేరా..?’ అంటూ ఆగ్రహించారు. తాను కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఇంజినీరింగ్ చదివానని.. అయితే అది వేరే విషయమని అన్నారు. రోజూవారీ కార్యకలాపాలకు ఇంగ్లీష్ను ఎందుకు ఉపయోగించాలి అని నితీశ్ వ్యాఖ్యానించారు.
#WATCH | "Farming is being done by a common man, you are called here to give suggestions but you are speaking in English. Is it England? This is India & it's Bihar…": Bihar CM Nitish Kumar interrupts a farmer while latter was delivering a speech during an event in Patna (21.02) pic.twitter.com/AUhzAlCnfU
— ANI (@ANI) February 21, 2023
Read Also..
Narayana Murthy | ఢిల్లీకి రావాలంటేనే అసౌకర్యంగా ఉందన్న ఇన్ఫోసిస్ మూర్తి.. ఎందుకంటే?!
ఫిబ్రవరిలోనే మండుటెండలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు..!
Earthquake | హిమాచల్.. ఉత్తరాఖండ్ల్లో ఏ క్షణంలోనైనా తీవ్ర భూకంపం.. ఎన్జీఆర్ఐ వార్నింగ్ బెల్స్!
బుల్డోజర్ పాలసీతో పెట్టుబడులు రావు