మెదక్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానకార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మెదక్ పంచముఖి ఆలయంలో 108 లీటర్ల ఆవు పాలతో క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విచ్చేసి పూజలు చేశారు. పలు చోట్ల శోభాయాత్రలు నిర్వహించారు.