కొండపాక (కుకునూరుపల్లి), ఏప్రిల్ 23: సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థికి అసాధ్యమైంది ఏమీ ఉండదని సివిల్ ర్యాంకర్ 321 బుద్ధి అఖిల్ అన్నారు. కొండపాకకు చెందిన ఆయన మంగళవారం కొండపాకలోని జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.విఠల్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి లక్ష్యం వైపు పయనించాలన్నారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఎంత పెద్ద అడ్డుంకులైనా ఎదుర్కోవాలన్నారు. అనంతరం స్ఫూర్తి కార్యక్రమంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానోత్సవం చేశారు.