Sachin Pilot : లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అంచనా వేశారు. తొలి దశ పోరులో కాంగ్రెస్, యూడీఎఫ్, విపక్ష ఇండియా కూటమి మెరుగైన సామర్ధ్యం కనిపించిందని తనకు గట్టి విశ్వాసం ఉందని అన్నారు. తొలి దశ పోలింగ్లో బీజేపీ వెనుకంజ వేసినట్టు స్పష్టంగా వెల్లడైందని చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాషాయ పార్టీ వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను విభజించే అంశాలు ఎలాంటి ప్రయోజనాలు అందించవని పైలట్ బీజేపీకి హితవు పలికారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, తొలి దశ పోలింగ్ నిరాశపరిచిందనే విషయం వారు పసిగట్టారని చెప్పారు.
అందుకే బీజేపీ నేతలు మతం గురించి మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరిచేందుకు హిందూ-ముస్లిం అంటూ విభజన చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. ఇక కేరళలో ప్రజల ఆశీస్సులతో తాము మొత్తం 20 స్ధానాల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదు.. ఆయన అందరివాడు : కేటీఆర్