లక్నో: బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పేదల ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రపంచమంతా చూసింది. బీబీసీ వంటి సంస్థలపై బీజేపీ ఐటీ దాడులు చేయిస్తూ మీడియాను బెదిరిస్తే.. ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు విఫలమైందని ఆరోపించారు.