ఖాట్మాండు : నేపాల్ను భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూకంపం 1.45 గంటల ప్రాంతంలో బజూరా జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. దాంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఇంకా ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని భూకంపాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ముకుంద భట్టారాయ్ తెలిపారు. అలాగే ఇంతకు ముందు 4.4 తీవ్రతతో జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భారత్లోని పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు పలు ప్రాంతాల్లోన ప్రకంపనలు కనిపించాయి. ఇటీవల నేపాల్ ప్రాంతంలో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. ఇంతకు ముందు 24న నేపాల్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత ఏడాది నవంబర్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.