న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసు కదా. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడూ తన అభిప్రాయాలకు కాస్త ఫన్ను కూడా జోడిస్తారు. తాజాగా కరోనా లాక్డౌన్లపై ఆనంద్ మహీంద్రా ట్విటర్లో స్పందించారు. ఈ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలతో జనం విసిగిపోతున్నారు. ఇవన్నీ ముగిసిపోయి సాధారణ పరిస్థితులు వస్తే హాయిగా ఎంజాయ్ చేసేద్దామని చాలా మంది అనుకుంటున్నారు.
ఆనంద్ మహీంద్రా కూడా అదే ప్లాన్లో ఉన్నారు. తన ట్విటర్లో ఓ కుక్క వీడియోను షేర్ చేస్తూ ఒక్కసారి ఈ లాక్డౌన్లు పూర్తయితే తాను కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తానంటూ సరదా ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన సంతోషంతోనో మరేంటోగానీ ఆ వీడియోలో ఆ కుక్క హాయిగా గెంతుతూ అటుఇటూ పరుగులు తీయడం చూడొచ్చు. చూస్తుంటే ఇది నా అవతారంలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారి ఈ లాక్డౌన్లు ముగిసిపోతే నేను కచ్చితంగా ఇలాగే చేస్తాను అని మహీంద్రా ఆ ట్వీట్లో కామెంట్ చేశారు. ఇది కాస్తా ట్విటర్లో వైరల్గా మారింది. నెటిజన్లు మహీంద్రా ఫన్నీ ట్వీట్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Well this pooch must be my avatar because that’s exactly how I’m going to behave when the lockdowns are over and done with… pic.twitter.com/Rvbr1jg4K1
— anand mahindra (@anandmahindra) April 14, 2021
ఇవి కూడా చదవండి
మూడు రోజుల్లోనే వ్యాక్సిన్పై డీసీజీఏ నిర్ణయం
కరోనా కేసులు ఇలాగే పెరిగితే ఒలింపిక్స్ రద్దు
ఆనంద్ తండ్రి విశ్వనాథన్ మృతి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం