మహరాజ్గంజ్: ఆ మధ్య ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్నూ ఒకేసారి ఇచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు యూపీలోని మహరాజ్గంజ్లో మరో వింత జరిగింది. ఓ వ్యక్తికి తొలిసారి కొవాగ్జిన్ టీకా వేయగా.. రెండో డోసు కోసం వెళ్తే కొవిషీల్డ్ ఇచ్చారు. మహరాజ్గంజ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (సీడీఓ) గౌరవ్ సింగ్ డ్రైవర్గా పని చేసే ఉమేష్ అనే వ్యక్తికి ఇలా రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చారు.
గౌరవ్ సింగ్కు డ్రైవర్లుగా పని చేసే ముగ్గురు వ్యక్తులు ఒకేసారి రెండో డోసు కోసం వెళ్లారు. అందులో ఉమేష్కు పొరపాటున కొవిషీల్డ్ ఇచ్చారు. ఈ విషయం తెలియగానే మిగతా ఇద్దరు వ్యక్తులకు రెండో డోసు ఇవ్వలేదు. అయితే దీనివల్ల ఉమేష్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆయన మెడికల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
అలియా భట్కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి