ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి రెండు స్టార్ హోటళ్లను దీనికోసం సిద్ధం చేశారు.
ప్రైవేటు ఆసుపత్రులు ఫోర్ లేదా ఫైవ్ స్టార్ హోటళ్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకోనున్నాయి. అత్యవసర చికిత్స అవసరం లేని పేషెంట్లను ఆసుపత్రుల నుంచి హోటళ్లకు తరలించనున్నారు. వీళ్లను తరలించే ముందు సదరు డాక్టర్ అనుమతించాల్సి ఉంటుంది.
పెద్దగా చికిత్స అవసరం లేని పేషెంట్ల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్కు ఈ హోటళ్లు అనుసంధానంగా పని చేస్తాయని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఇలాంటి హోటళ్లలో కనీసం 20 గదులు కొవిడ్ పేషెంట్ల కోసం ఉండటంతోపాటు 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉండాలి.
ఈ వసతి కల్పించడానికి హాస్పిటల్స్ రోజుకు ఒక్కో గదికి రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేయవచ్చని బీఎంసీ తెలిపింది. లక్షణాలు లేని కొవిడ్ పేషెంట్లు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని చెప్పింది. హాస్పిటల్లో చికిత్స అవసరమైన అందరికీ అవి అందుబాటులో ఉంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇప్పటికే సగం వరకూ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదువుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
అలియా భట్కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి