న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యులు విధిస్తున్నాయి. వీటి కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రం మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తమ జీవనోపాధి కోల్పోయే నిరుపేదల కోసం ఈ ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తన రిపోర్ట్లో వెల్లడించింది.
గతేడాది కరోనా సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్ తగ్గి ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ఉద్ధృతంగా దాడి చేస్తోంది. ఈసారి దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.
దీని కారణంగా లాక్డౌన్లు, 144 సెక్షన్లు, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఇవి మరోసారి పరోక్షంగా బ్యాంకులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాదికి ఆర్బీఐ ఇంకా మారటోరియం కూడా ఇంకా ప్రకటించలేదు. బ్యాంకు రుణాల్లో 45 శాతం వాటా ఉన్న ఆరు రాష్ట్రాల్లోనే 80 శాతం కరోనా కేసులు ఉన్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఈ మధ్యే వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
అలియా భట్కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్