టోక్యో: ఒలింపిక్స్కు మరోసారి కరోనా గండం పట్టుకుంది. జపాన్లో కేసుల సంఖ్య పెరిగితే, గేమ్స్ నిర్వహించడం సాధ్యం కాకపోతే రద్దు చేసేస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తొషిహిరొ నికాయ్ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగితే.. ఇక ఆ గేమ్స్ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. జపాన్ అధికార పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఆయన. ఆ పార్టీలో రెండో అత్యంత శక్తివంతమైన నేత నికాయ్.
ఓ టీవీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్ను విజయవంతం చేయాలని తాము కూడా భావిస్తున్నామని, అయితే అంతకుముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని నికాయ్ అన్నారు. గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ను కరోనా కారణంగా ఈ ఏడాదికి తరలించారు. జులై 23న గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉన్నాయి.
అయితే అందుకు సరిగ్గా 99 రోజులు ముందు నికాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జపాన్లోని ఒసాకాలో ఈ మధ్య భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ మధ్యే ఎత్తేసిన ఎమర్జెన్సీని మళ్లీ విధించారు. దీంతో ఇక్కడ జరగాల్సిన ఒలింపిక్ టార్చ్ రిలే రద్దయింది. మరోవైపు ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం గేమ్స్ను కొవిడ్ నిబంధనల మధ్య విజయవంతంగా నిర్వహించవచ్చని అంటున్నారు. అయితే అందుకు విరుద్ధంగా జపాన్ ప్రజల్లో చాలా మంది గేమ్స్ నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఒపినియన్ పోల్లో మెజార్టీ ప్రజలు గేమ్స్ను రద్దు లేదా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఆనంద్ తండ్రి విశ్వనాథన్ మృతి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం