జగిత్యాల: జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్షలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇండ్లలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నది. కాగా, వ్యాపారి తుకారం ఇంట్లోనే 35 తులాల బంగారం, వెండి ఆభరణాలు, రూ.2.5 లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తున్నది. తుకారం కుటుంబం అంతా హైదరాబాద్కు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.