భువనేశ్వర్, జూలై 4: పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో 4 వేల ఏండ్ల క్రితంనాటి వస్తువులు కొన్ని బయటపడ్డాయి. ఒడిశాలోని బాలసోర్ జిల్లాకు సమీపంలోని దుర్గాదేవీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒడిశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ఈ తవ్వకాల్ని జరిపింది. క్రీస్తుపూర్వం 2,000 ఏండ్ల నుంచి క్రీస్తుపూర్వం 200 ఏండ్ల మధ్య అప్పటి ప్రజలు వినియోగించిన కొన్ని మట్టి వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డట్టు అధికారులు తెలిపారు.