హైదరాబాద్: నగర శివార్లలోని చింతల్లో దారుణ హత్య జరిగింది. చింతల్లోని భగత్నగర్లో ఓ మహిళను హత్యచేసిన దుండగులు నగలు ఎత్తుకెళ్లారు. నిన్న మహిళ భర్త రోజువారీ విధుల నిమిత్తం ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఒంటరిగా ఉన్న మహిళ మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సుమారు రూ.5 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విషయాన్ని గుర్తించిన ఆమె భర్త జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి