హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 386 గ్రాముల బంగారం లభించింది. దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.19.1 లక్షలు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని పేస్టు రూపంలో తరలిస్తున్నాడని తెలిపారు. అతడిని విచారణ నిమిత్తం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..