న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి మరో రాజకీయ ప్రముఖుడు బలయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీలో నిన్న 28,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,05,541కి చేరింది. ఇందులో 8,07,328 మంది బాధితులు వైరస్నుంచి కోలుకోగా, 85,575 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 12,638 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజే వైరస్ ప్రభావంతో 277 మంది చనిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..