దాంట్లో 53 మంది సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా ఆర్మీ ప్రకటన
ఆచూకీ కోసం ముమ్మర అన్వేషణ
జకర్తా, ఏప్రిల్ 21: ఇండోనేషియాకు చెందిన ఓ జలంతర్గామి ఆచూకీ లేకుండా పోయింది. దాంట్లో 49 మంది సిబ్బంది, ఒక కమాండర్, ముగ్గురు గన్నర్స్ ఉన్నట్టు ఆ దేశ ఆర్మీ బుధవారం వెల్లడించింది. జలాంతర్గామి ఆచూకీ కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్లతో నావికాదళం ముమ్మర చర్యలు ప్రారంభించినట్టు పేర్కొంది. శిక్షణా విన్యాసాలు జరుగుతున్న క్రమంలో ‘కేఆర్ఐ నంగ్గాలా 402’ అనే జలాంతర్గామి కనిపించకుండా పోయినట్టు ఆర్మీ చీఫ్ హదీ జహ్జాంటో తెలిపారు. ఉత్తర బాలికి 95 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో 2,000-2,300 అడుగుల లోతున ఉండగా సబ్మెరైన్తో సంబంధాలు తెగిపోయినట్టు వివరించారు. జలాంతర్గామి అన్వేషణకు సింగపూర్, ఆస్ట్రేలియా సాయాన్ని కోరామన్నారు.