హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఉప్పల్లో ఉండే శ్రీనివాస్ (40)కి కరోనా వచ్చింది. దవాఖానకు వెళ్తే అంత సీరియస్ ఏం కాదు. ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదని ఇంటికి పంపించారు. కానీ, శ్రీనివాస్ మాత్రం తెగ భయపడిపోతున్నాడు. దవాఖానలో ఉండి చికిత్స తీసుకోవాలని, అప్పుడే తాను కోలుకుంటానని బలంగా విశ్వసిస్తున్నాడు. ప్రైవేటు దవాఖానలో చేరుదామంటే రూ.60 వేలు, రూ.70 వేల ప్యాకేజీ అడుగుతున్నారు. ఆ సమయంలో ఐసీయూ ఎట్ హోమ్ కాన్సెప్ట్ గురించి తెలిసింది. రూ.12 వేల ఖర్చుతో ఇంట్లోనే చికిత్స తీసుకొని కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దవాఖానలో చేరి కరోనా చికిత్స తీసుకోవాలనుకునే ఎవరైనా ఐసీయూ ఎట్ హోమ్ కోసం డాక్టర్ రాజ్కుమార్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫోన్ నంబరు (78754 88900)లో సంప్రదించవచ్చు. డాక్టర్లే ఇంటికి వెళ్లి పరిశీలించి మందులు, ఇంజెక్షన్లు ఇస్తారు. అవసరమైనవారు కేర్టేకర్లను కూడా నియమించుకోవచ్చు. తొలి డాక్టర్ కన్సల్టెన్సీ ఇంటి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత నుంచి డాక్టర్ వాట్సాప్లో రోజూ (టెలీ కన్సల్టెన్సీ) ద్వారా మానిటర్ చేస్తుంటారు. రోగి అడిగే సందేశాలను తీర్చడంతోపాటు అవసరమైన మందులను రెఫర్చేస్తారు. ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమయ్యే సీరియస్ కేసులను ఈ సంస్థ తీసుకోవడం లేదు. మైల్డ్ అండ్ మోడరేట్ కేసులనే తీసుకుంటుంది. ప్రస్తుతం 50 కేసులను వీరు ట్రీట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.
మా సంస్థలో 50 మం ది వైద్యులు (క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, డ్యూటీ డాక్టర్లు), 50 మంది సిబ్బంది ఉన్నారు. చికిత్స మొత్తం రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపే పూర్తవుతుంది. మా గురించి తెలుసుకొని చాలామంది అంబులెన్సులో ఉండి కూడా ఫోన్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడికి వళ్లైనా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏవైనా సంస్థలు ముందుకొస్తే వారితో కలిసి పనిచేస్తాం.
డాక్టర్ రాజ్కుమార్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్