(Alert on Air Pollution) వాయు కాలుష్యం గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనల్లో తేలింది. అమెరికాలో తాజాగా జరిగిన పరిశోధనలు ఇందుకు సంబంధించిన మరో సమాచారాన్ని వెల్లడించాయి. కిడ్నీ రోగంతోపాటు హై బీపీతో బాధపడుతున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఇది వారి గుండెను మరింత బలహీనపరుస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ కిడ్నీ వీక్-2021లో ఈ విషయం వెల్లడైంది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వాయు కాలుష్యం నేరుగా గుండె జబ్బులకు సంబంధించినది. వాయు కాలుష్యం నుంచి మనల్ని మనం రక్షించుకుంటే గుండె జబ్బుల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. కిడ్నీ రోగుల్లో అధిక రక్తపు పీడన స్థాయిలు-3 గ్లెసిటిన్తో పోరాడుతాయని పరిశోధకులు చెప్తున్నారు. ఇది నేరుగా వాయు కాలుష్యానికి సంబంధించినది. దీని కారణంగా గుండె అంతర్గతంగా బలహీనంగా మారుతుంది. ఇలాంటి రోగులలో మయోకార్డియల్ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడుతుందని 1,019 మంది రోగులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. అంటే, గుండె బలహీనపడటం ప్రారంభమవుతుందన్నమాట. ఇది గుండెపోటుకు లేదా మరణానికి కూడా దారి తీస్తుంది.
ప్రతి నిత్యం తేలికపాటి వ్యాయామాలు చేయడం అలవర్చుకోవాలి. జిమ్కెళ్లి వ్యాయామాలు చేసే అవకాశం లేనప్పుడు ఇంటి ఆరు బయట వాకింగ్ చేయాలి. ఆహారపుటలవాట్లపై దృష్టి సారించాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేట్లుగా చూసుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ మానుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఊబకాయం లేకుండా చూసుకోవాలి. బీఐఎం ప్రకారం శరీరాకృతి ఉండేలా చూసుకోవాలి. నడుం భాగంలో కొవ్వు అధికంగా చేరి ఊబకాయంగా మారిన వారిలో కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మనం తినేవాటిపై దృష్టిపెట్టాలి. ఏం తినాలి అనేది కూడా తెలుసుకుని ఫాలో కావాలి. నిత్యం 7-8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం అలవర్చుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్సేపు కునుకు తీయడం గుండెకు ఎంతో మంచిదని గుర్తుంచుకోవాలి.
ఛాతీ భాగంలో నొప్పిగా ఉంటే.. ఛాతీ భాగంలో నొక్కి పెట్టినట్లుగా ఉన్నప్పుడు.. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారినప్పుడు.. చేతులు, కాళ్లు చల్లగా మారినప్పుడు, గొంతు, దవడ, పొట్ట, నడుం యొక్క పైభాగంలో నొప్పి రాగానే వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
ఇంటర్ మూల్యాంకనం విధులకు ముఖం చాటేసిన ప్రైవేటు టీచర్లు
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
పేదలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటాం : డిప్యూటీ సీఎం ధర్మాన
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..