విజయవాడ : (Mopidevi) నానాటికి తీసికట్టుగా తయారైన పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చర్చించాలని, అనంతరమే వాటి ధరల పెంపుదలపై నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో జనంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నదన్నారు. ఇంధనం ధరలు పెంచేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థికస్థితిగతులను కూడా కేంద్రం పరిగణంలోకి తీసుకోవాలన్నారు. కేంద్రాన్ని అడగాల్సిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయడం సరికాదని చెప్పారు. వీరు ఒత్తిడి తేవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాదు.. కేంద్రంపై అని బీజేపీ నేతలకు సూచించారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందని మోపిదేవి వెంకటరమణ చెప్పారు. కేంద్రం తగ్గించాల్సిన మోతాదులో తగ్గించాల్సి ఉంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తన స్టాండ్ను కొనసాగించిన ఆయన.. రాష్ట్రానికి హోదా కావాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు విషయంలో పవన్ డెడ్ లైన్ పెట్టాల్సింది కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదన్నారు. విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తామూ పోరాటం చేస్తూనే ఉన్నామని మోపిదేవి స్పష్టం చేశారు.
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..