హైదరాబాద్ : (Nursing Students) దీపావళి పండుగ రోజున నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది. అదేవిధంగా, ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్థులకు తొలిసారిగా స్టైఫండ్ మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లు, నర్సింగ్ కాలేజీలు, నిమ్స్లో చదువుతున్న జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. తాజా ఉత్తర్వులతో ప్రతి ఒక్కరికీ స్టైఫండ్ కనీసం మూడు రెట్లు పెరుగనున్నది. దేశంలోనే నర్సింగ్ విద్యార్థులకు అత్యధిక స్టైఫండ్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అధికారులు తెలిపారు.
నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ ఏడాది జూలైలో ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు స్టైఫండ్ పెంచాల్సిందిగా సీఎంను కోరారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్.. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంచుతామని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం మొదటి సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ను రూ.1500 నుంచి రూ.5,000 కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రూ.1,700 నుంచి రూ.6,000, తృతీయ సంవత్సరం విద్యార్థులకు రూ.1,900 నుంచి రూ.7,000, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి రూ.8,000 కు పెంచారు. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నిమ్స్లో చదువుతున్న ఎమ్మెస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.9వేలు, రెండో సంవత్సరం రూ.10వేలు స్టైఫండ్ ఇవ్వనున్నారు.
ఈనెల 7వ వరకు వానలు కురిసే అవకాశం
బస్సు కోసం సీజేఐకి చిన్నారి లేఖ.. ఏర్పాట్లు చేసిన సజ్జనార్
దేశవ్యాప్తంగా 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు : ఐఓసీ
మూడో రోజు కొనసాగిన రైతుల మహా పాదయాత్ర
కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..