హైదరాబాద్ : (Karthika masam) కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శైవ, వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి వెల్లడించారు. ఈ మాసంలో కార్తీక దీపోత్సవాలు, తులసీ అర్చనలు, సామూహిక వ్రతాలు అధికంగా ఉంటున్నందున ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించినట్లు, ఈ మేరకు అన్ని ఆలయాల కార్యనిర్వాహణ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. భక్తులు కూడా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతి సూచించారు.
దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కార్తీక మాసోత్సవ పూజల కరపత్రాన్ని అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ విజిలెన్స్ అధికారి కృష్ణవేణి, ప్రాంతీయ కమిషనర్ ఎం రామకృష్ణారావు, అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మతోపాటు పలువురు అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..