విజయవాడ : (AP Government) ఏపీ ప్రభుత్వం ఆకస్మికంగా సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకురానున్నారు.
అదేవిధంగా, జైన్ మతస్థులు, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మరో రెండు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఈ మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంతో తాజాగా వాటికి సంబంధించిన జీవోలను విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకానికి అర్హులైన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. 45 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసున్న మహిళలకు ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేండ్లు రూ.45వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. ఈ ఆర్థిక సాయంతో చిన్నపాటి వ్యాపారం చేసుకుని పైకి రావొచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది.
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..