Diabetes and sugar | డయాబెటిస్.. ఇప్పుడు జనాల్ని ఎక్కువగా భయపెట్టిస్తుంది ఈ చక్కెర వ్యాధి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే ఇక అంతే. తగ్గడం అంటూ ఉండదు. నోరు కట్టేసుకుని ఉంటే కాస్త అదుపులో ఉంటుంది. లేదంటే శరీరంలో విచ్చలవిడిగా చక్కెరస్థాయులు పెరిగిపోతాయి. దీనివల్ల పాదాల నుంచి మొదలుపెడితే మెదడు వరకు ప్రతి అవయవం దెబ్బతింటుంది. అంత ప్రమాదకరమైనది ఈ వ్యాధి. ప్రస్తుతం భారత్లో చాలామందిని డయాబెటిస్ బాధిస్తుంది. మన దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇంతమందిని బాధిస్తున్న మధుమేహం ఎలా వస్తుంది? చక్కెర వ్యాధి చక్కెర ఎక్కువగా తింటేనే వస్తుందా? లేదా ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? వంశపారంపర్యంగా డయాబెటిస్ వస్తుందన్న మాటల్లో ఎంత నిజముంది? ఈ వివరాలు ఒకసారి చూద్దాం..
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందని అంటారు. కానీ ఇవి నేరుగా డయాబెటిస్కు కారణం కావు. ఇవన్నీ ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతాయి. ఊబకాయం మధుమేహానికి దారితీస్తుంది. ఇక తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుందనేది నిజం కాదు. శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదల కాకపోవడం మధుమేహానికి ప్రధాన కారణం. సాధారణంగా ఇన్సులిన్ శరీరంలోని షుగర్ లెవల్స్ను నియంత్రిస్తుంది. కానీ ఎప్పుడైతే శరీరానికి సరిపడ ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదో అప్పుడు శరీరంలో చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. దీన్నే షుగర్ ( మధుమేహం ) అంటారు. అధిక బరువు, ఊబకాయంతో పాటు వంశపారంపర్యంగా కూడా మధుమేహం రావడానికి ప్రధాన కారణం.
స్వీట్ల రాడార్ నుంచి మధుమేహం దూరంగా ఉండదు. కేక్ ముక్కను ఆస్వాదించాలనుకుంటే దానికి కొంత ప్రణాళిక అవసరం. మధుమేహంతో బాధపడేవారు చక్కెరను ఎప్పుడూ తినలేరు అనేది అపోహ మాత్రమే. ఏదైనా తిన్న ప్రతిసారీ కార్బోహైడ్రేట్లను లెక్కించడం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యమైన భాగం. స్వీట్లు, కుకీలలో పిండి పదార్థాలు ఉంటున్నందున డయాబెటిక్ రోగులు.. వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం స్థానంలో ఒక చిన్న కేక్ ముక్కను తీసుకోవచ్చు.
సాధారణంగా గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో ఇన్సులిన్ కావాల్సినంత ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల చక్కెరస్థాయులు విపరీతంగా పెరిగిపోతాయి. దీన్ని జస్టినేషనల్ డయాబెటిస్ అని అంటారు. దాదాపు 9 శాతం మంది మహిళలు.. గర్భధారణ సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు కూడా ఈ సమస్య వస్తుందని కాదు. కాకపోతే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. రక్తంలో అధిక షుగర్ లెవల్స్ కారణంగా పుట్టబోయే బిడ్డలో కావాల్సిన దానికంటే ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పుట్టబోయే బిడ్డలో అధిక బరువు, ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, శ్వాస సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
డయాబెటిస్ రోగుల్లో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. వీరు తొందరగా కోపానికి, డిప్రెషన్కు లోనవుతుంటారు. ఆత్రుతగా కనిపిస్తుంటారు. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ను పదే పదే చెక్ చేయడం కూడా ఒత్తిడికి గురి చేస్తాయి.
ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోలు : సమీక్షలో సీఎం జగన్
వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
నా చర్మంతో జగన్కు చెప్పులు కుట్టించినా రుణం తీరదు : నారాయణ స్వామి
సీక్రెట్గా క్వాంటం సూపర్ కంప్యూటర్ తయారుచేసిన డ్రాగన్
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..