కడప : (Badvel Counting) బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని బాలయోగి గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నట్లు వెల్లడించారు. కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉన్నదని, కౌంటింగ్ సూపర్ వైజర్, మైక్రో అజ్వర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ 233, సర్వీస్ ఓటర్లు ముందుగా లెక్కిస్తామని తెలిపారు. వీటి ఫలితాలు 8 గంటల తర్వాత వస్తాయన్నారు.
మొత్త పది రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటల వరకే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2, 15, 392 ఓట్లు ఉండగా.. 1,46,562 ఓట్లు పోలయ్యాయి. బరిలో 15మంది అభ్యర్ధులున్నా.. ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే కనిపించింది. గత ఎన్నికల్లో 1.58 లక్షల ఓట్లు పోలైతే, అందులో 60 శాతం ఓట్లు ఒక్క వైసీపీకే వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. 2019 లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
ఫిజిక్స్ ప్రశ్నకు సమాధానం కోసం.. ఈ యూట్యూబర్ ఏం చేశాడంటే..?!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..