గుంటూరు: (Maha Padayatra) రాష్ట్ర రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ రైతులు చేపడుతున్న మహాపాదయాత్ర మూడో రోజుకు చేరింది. రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహా పాదయాత్ర చేపట్టారు. మూడో రోజు పాదయాత్ర గోరంట్ల నుంచి ప్రారంభైంది. 45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనున్నది. డిసెంబర్17న తిరుపతిలో జరిగే బహిరంగ సభతో మహాపాదయాత్ర ముగియనున్నది.
తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోరంట్లలో గ్రామస్థులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికి వారికి బస ఏర్పాట్లు చేశారు. ఈ పాదయాత్రలో రాజధాని రైతులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. రైతులు, మహిళలు పుల్లడిగుంటలో ఈ రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు.
కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..