KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొనున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. ఉదయం 11:30 గంటలకు వీర్నపల్లి మండలం బావుసింగ్ భూక్యా తండాలో జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట వేడుకలకు హాజరుకానున్నారన్నారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కోరుట్లపేట గ్రామ శాఖ అధ్యక్షుడు బాలమల్లు సోదరి వివాహానికి హాజరవుతారు. జీకే ఫంక్షన్ హాల్ పెద్దూరులో మధ్యాహ్నం 3 గంటలకు హరిదాస్ నగర్ సీనియర్ నాయకుడు చీల అనిల్ కూతురు వివాహానికి హాజరవుతారని వెల్లడించారు.
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!