అమరావతి : (Tulsi reddy) సచివాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభివర్ణించారు. విశాఖకు రాజధాని తరలింపు రాయలసీమ ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక రాజధాని మాత్రమే ఉన్నదన్న విషయాన్ని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఇకనైనా రాజధాని తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హితవుపలికారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు.
రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తులసిరెడ్డి తెలిపారు. మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం తెలిపినట్లు ప్రకటించారు. రైతుల సమస్యను ప్రభుత్వం సామరస్యపూర్వకంగా అర్ధం చేసుకుని పరిష్కరించాలన్నారు. ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ఏర్పాటును విరమించుకోవడం ద్వారా రైతులకు సంపూర్ణ న్యాయం చేకూరుతుందని తులసిరెడ్డి చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం విలువైన భూములను ఇచ్చిన అన్నదాతలను ఆదుకోవడం ప్రభుత్వం విధి అని, టీడీపీ హయాంలో భూముల సమీకరణ జరిగిందంటూ రాజధాని మార్పుపై ఆలోచించడం తగదన్నారు.
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..