హైదరాబాద్ : 24 గంటలుగా కరెంట్ లేదని ఆగ్రహించిన గ్రామస్తులు సబ్స్టేషన్ను ముట్టడించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో గత 24 గంటలుగా కరెంట్ లేకపోవడంతో గ్రామస్తులు చెన్నూరు సబ్స్టేషన్ను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
24 గంటలుగా కరెంట్ లేదని సబ్స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో గత 24 గంటలుగా కరెంట్ లేకపోవడంతో, చెన్నూరు సబ్స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు
రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల నిరసన, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ pic.twitter.com/nN1fRrOLuk
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026