చిత్తూరు : (Gold Biscuits) తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భూరీ విరాళం అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి రూ.1. 83 కోట్ల విలుమైన 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డికి బంగారం బిస్కెట్ల విరాళాన్ని అందించారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కొవిడ్ అనంతరం తిరుమలలో భక్తుల రద్దీ ఇప్పుడిప్పుడే మెల్లగి పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచుతూ వస్తున్నది. దీంతో రోజుకు సగటున 20-30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.
ఇలాఉండగా, పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు గోపీచంద్ తదితరులు దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు.
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..