కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా(Kolkata)లోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్లో మంగళవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 9 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 1.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకున్నది. అగ్నిమాపక సిబ్బంది తో పాటు పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పై అంతస్తులకు చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీ మెషిన్ బ్లాస్ట్ కావడం వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులంతా బంగ్లాదేశీ దేశస్థులు అని తెలిసింది. వైద్య చికిత్స కోసం వాళ్లు కోల్కతాకు వచ్చినట్లు తెలుస్తోంది.