గుంటూరు : (Mahapadayatra) రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతున్నది. ఆరో రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రారంభమైంది. ఇవాళ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ దాదాపు 14 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర జరుగనున్నది. మహా పాదయాత్రకు ప్రకాశం జిల్లా నేతలు, రైతులు సాదర స్వాగతం పలికారు. మహాపాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు గ్రామస్తులు బూట్లు, గొడుగులు అందించి సంఘీభావం తెలిపారు.
రాజధాని కోసం వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు నాగులపాడు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, గ్రామస్తులు పాదపూజ నిర్వహించారు. రైతుల పాదాలపై పూలు చల్లి పూజలు చేశారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు 150 మంది రైతులకు బూట్లు, గొడుగులు అందించారు. ప్రజలు చూపించిన ఈ అభిమానంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రాజధాని రైతులకు మద్దతు కోసం బయలుదేరి వెళ్లారు.
అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థాననం మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 12 రోజులపాటు యాత్ర సాగనున్నది. రెండు రోజులు విశ్రాంతి కోసం మార్గంమధ్యలో రైతులు ఆగనున్నారు. పర్చూరు మండలం చిన నందపాడులో మహాయాత్ర ప్రవేశించింది. తొలిరోజు చిననందిపాడు నుంచి అడుసుమల్లి, పర్చూరు వరకు యాత్ర ఉంటుంది.
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..