కాళేశ్వరం : (Kaleshwaram) పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం భక్తుల సందడి నెలకొన్నది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు త్రివేణి సంగమం గోదావరి తీరంలో భక్తులు స్నానాలు ఆచరించారు. మహిళలు గోదావరి నదిలో ప్రత్యేక దీపాలు వదిలి సైకత లింగాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో శని, కాలసర్పధోష నివారణ పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కాళేశ్వర, ముక్తిశ్వర స్వామికి వివిధ ప్రాంతల నుంచి వచ్చన భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శుభానంద దేవి ఆలయంలో కుంకుమ అర్చనలు జరిగాయి. కార్తీక మాసం గురించి అర్చకులు భక్తులకు శివ కళ్యాణం మండపం వద్ద భక్తులకు వివరించారు. ఆలయంలోని తులసి, మారేడు చెట్లకు వచ్చిన భక్తులు ప్రదిక్షణలు చేశారు. లక్ష వొత్తులతో కార్తీక దీపాలు వేలిగించారు. భక్తులు అర్చకులకు కార్తీక దీపదానం చేశారు. సాయంత్రం వేళలో కార్తీక దీపాన్ని ఆలయ అర్చకులు కృష్ణముర్తి శర్మ వేలిగించి ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. పోలీసులు, వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. కాళేశ్వరం నుంచి జిల్లా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రైవేట్ వాహనాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..