హైదరాబాద్ : (Inter Spot) ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్కు అధ్యాపకులు గైర్హాజరయ్యారు. విధులు కేటాయించినా చాలా మంది డుమ్మాకొడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలకు చెందిన టీచర్లు.. ఇంటర్ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధులకు గైర్హాజరవుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులను రిలీవ్ చేయకపోవడంతోనే వీరంతా హాజరు కావడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
ఇంటర్ పరీక్షలు ఇటీవలే పూర్తికావడంతో ఇంటర్ బోర్డ్ స్పాట్ వాల్యుయేషన్ చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ అధ్యాపకులకు స్పాట్ విధులు కేటాయించారు. అయితే, చాలా మంది డ్యూటీలకు రావడం లేదని సమాచారం. పలు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో 35 శాతం కన్నా తక్కువగా రిపోర్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 35-40 శాతంలోపే అధ్యాపకులు రిపోర్ట్ చేశారు. మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో 70-80 శాతం హాజరుకాగా, చాలా జిల్లాలో హాజరు శాతం తక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ రంగంలోకి దిగారు. శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వారీగా అధ్యాపకుల హాజరు వివరాలను తెప్పించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో కార్పొరేట్ కాలేజీలు తరగతులు నిర్వహణను సాకుగా చూపిస్తూ ముల్యాంకనం విధులకు అధ్యాపకులను పంపించడం లేదని అధికారులు గుర్తించారు. ప్రైవేట్ కాలేజీల నిర్వాకంపై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తంచేశారు.
దీనికి పరిష్కారంగా ఇంటర్ తరగతులను వారం రోజుల పాటు వాయిదా వే స్తే బాగుంటుందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. క్లాసులను వాయిదావేస్తే అధ్యాపకులు వాల్యుయేషన్ డ్యూటీలను తప్పించుకోకుండా హాజరయ్యే అవకాశం ఉంటుందని, యాజమాన్యాలు సైతం తప్పనిసరి పరిస్థితులో అధ్యాపకులును రిలీవ్ చేస్తాయన్న అంచనాకు వచ్చారు. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అనుమతి కోరారు. వారు అనుమతించగానే ఇంటర్ తరగతులను వారంపాటు వాయిదావేయనున్నట్లు సమాచారం.
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
పేదలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటాం : డిప్యూటీ సీఎం ధర్మాన
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..